Post by Bharat Aawaz

879 followers

"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పోలీస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది. నూతన డీజీపీ సీవీ ఆనంద్ సోషల్ మీడియా వినియోగంపై స్పందిస్తూ, కేసులు నమోదు చేసే విషయంలో యాంత్రిక ధోరణి అనుసరించకూడదని స్పష్టంచేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు “నల్లబాలు వర్సెస్ స్టేట్” కేసులో సూచించిన మార్గదర్శకాలను తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయ వ్యక్తీకరణకు గౌరవం ఇస్తూనే, దుర్వినియోగాన్ని మాత్రం సహించబోమన్న సందేశాన్ని ఇచ్చారు. అయితే, ఎవరైనా సోషల్ మీడియాలో పరుష పదజాలంతో దూషించినప్పుడు చర్యలు తీసుకోవద్దని ఎలా అనుకోవచ్చని ఆయన ప్రశ్నించారు. “మీపై ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే మీరు ఎలా స్పందిస్తారో ఆలోచించాలి. అలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరమని డీజీపీ మరోసారి గుర్తుచేశారు. #Sidhumaroju #Bharataawaz #Cybercrime #CyberLaw #DGPAnand #DigitalResponsibility #FreedomOfSpeech #HighCourt #LawAndOrder #OnlineAbuse #ResponsiblePosting #SocialMediaPolicy #SocialMediaRules #SupremeCourtGuidelines #Telangana #TelanganaPolice #Telangana Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content