Post by Bharat Aawaz
879 followers
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.శీర్షిక: లోకేష్ ‘100 రోజుల ప్రణాళిక’తోనే టెన్త్లో అద్భుత ఫలితాలు: ప్రభుత్వ విప్ వేపాడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలు చేసిన '100 రోజుల ప్రణాళిక'తో ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించాయని ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు కొనియాడారు. గత ఏడాది 81.1 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 85.25 శాతానికి పెరగడం ప్రభుత్వ విద్యా విధానానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం సందర్భంగా ఉత్తరాంధ్రలోని 60 మంది టాపర్లను విజయనగరంలో ఘనంగా సత్కరించి, నగదు బహుమతులు అందజేశారు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్, ద్విభాషా క్వశ్చన్ బ్యాంకులు విద్యార్థులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాయని, ఇది ప్రభుత్వ విద్యారంగంలో నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. #AndhraPradeshEducation #Bharataawaz #SSC2026Toppers #UttaraAndhra #VepadaChiranjeevi #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!